Friday 24 August 2012

Yerri Thatha

7 comments

 

Yerri Thatha

www.Yerri_Thatha.com

Introduction

“Sri Swamiji was a Siddhapurusha (Perfect Spiritual Master) and if He performed miracles, it was with a view to inspire devotion in his devotees and to induce in them an increasing faith in God. Prophets of God and great religious reformers before him have performed miracles. Did not Jesus Christ, Basaveswara and a host of others perform miracles? The Super natural events associated with them made the devotees God loving and religious minded.”

Early Days

Sri Yerriswamy was a great soul, an Avathara Purusha. The District of Bellary (A.P), celebrated in many ways, was sanctified by His presence.
One report is that Sri Yerrithatha was from Tumkur (Karnataka) and that he was a Magistrate and that while in service, he used to go into a trance. After a point of time, he left his job. He would climb to the top of a coconut tree and sit there in yogic contemplation. He had understood the tenets of Veerashaivism and the worship of Linga and became a “Siddhapurusha” (SathPurusha).
It is also said that Sri Yerrithatha’s original name was Nanjundappa and that he came from Linganahalli and that he was given to simple living and that he learnt much from Nagappa, a Lingayat scholar of Linganahalli. When Nagappa realised that Sri Yerrithatha was greater than him, he told him that there was nothing to learn from him and that he would do well to approach Ganganarya of Doddaballapur.
Sri Thatha proceeded to Doddaballapur to meet Sri Ganganarya and waited for two or three days to seek his “Darshan” and blessings.
Sri Ganganarya commanded him to go round the town thrice in a naked state. Sri Yerrithatha obeyed the Guru and received the benediction.
Thereafter the Swamiji did not go back to Linganahalli but stayed in the service of his Guru. Sri Ganganarya named this Nanjundappa as “Niranjana.”

Prophesy

Sri Mariswami Shivayogi, and his great disciple, Sakkari Kaadeppa, lived in Bellary and by their Super-human deeds, attracted a large following.
We may mention several in this connection, – Lakshamma of Adoni, Jedappa Thatha of Yammiganur, Gadilingappa of Gulya, Lingappa of Kokkarachedu, Mariswami of Balaganoor, Guddada Gavisiddheswara, and Chidanand avadhootha of Ayodhya, Shivarama avadhootha of Hemakoota and Venkavadhootha. They were all sages.
Sri Mariswami of Balaganoor, used to prophesy that to the village of Chellagurgi would be coming one day the great Yerriswamy. Before He came, it is said that Sri Mariswamy visited the village frequently and built a toy-like hut where the present Mutt is built. He used to answer, “This is a Mutt. Here would be arriving a great soul, a ‘Shiva yogi’. For Him I am building this Mutt. This place will become a famous centre of pilgrimage in future.”
True to this prophesy with in a short time, the great Yerriswamy arrived. It is learnt that he came to the place in the year 1897.

Miracles

Staying in Mallamma’s House
Sri Yerrithatha used to go to about the bazaar. He would be either found at the Basaveswara temple or at the Kanyakaparameswari temple. Sometimes He used to be in the house of Guramu Sanjeevamma or in that of Hebbavasathi Jeevamma alias Mallamma. The latter was very poor, and by her devoted service became prosperous. Being a devotional lady, she extended her utmost hospitality to the saints and sages who visited her. Once a saint Allaswamy said to Jeejamma that a Swami greater than himself would be coming to her house and asked her to serve him and became prosperous. So saying he left. It was left to Jeejamma to serve the Swamiji when He came to her.
To those mothers who asked Him for a remedy for their children’s fever, he would ask for a piece of jaggery to stop it. When that was done, the fever would abate. When some others asked Him, he used to utter, ” Jaya Namah Parvatipathe Hara Hara Mahadev.” If He uttered these words, it meant that those children had no chance of survival.

Her family had ostracized Yamunamma, as she was infected with leprosy. She sought the protection of Swamiji at the premises of the Mutt. She remained outside the main entrance of the Mutt by sweeping the veranda. As a consequence of her unassuming devotion, she became free from the fell disease. His mercy is truly infinite.

Sri Yerrithatha used to stay at the same time in three or four places and would talk with the people. At Uruvakonda, two women had gone to invite him. The Swamiji dived into a well and brought out two snakes. To the utter surprise of the women, he said to them, ” You can take the snakes.” One woman ran away in fright and the other taking courage in both her hands agreed to take it. It is the lady that became rich soon after.

Once, Sri Yerrithatha approached a house and asked the old lady of the house to bring Him some curds. It so happened that a calf was dead in the house and we can understand the feelings of the woman who was asked for curds when the calf was dead. The Swamiji sensed the pangs of the old woman and gently kicked the dead calf commanding it to wake up. The dead calf at once came to life and went near its mother.


Sri Yerithatha used to dive in the tank and swim at will in the wells. He would eat only when somebody offered Him. But again He would go down the water come out whenever it pleased Him. It once happened that a man jumped right on Sri Yerithatha when He was in water. As a result, the Swamiji went deep down the water. The nervous man began a frantic search for the Swamiji in the well but unable to find Him, was tracing his steps back into the town when he was perplexed beyond measure to find Him worshipping Basavanna at the local Basaveswara temple.


Contemporaries

Many used to go to the Swamiji seeking his blessings. Many used to frequent the Mutt seeking his presence. Sri Yerrithatha used to speak but rarely. What exactly he was saying to the devotees and what exactly they made out of his words is not known. Even when he broke his silence, it was difficult to make out anything from his utterances. Expressions were often symbolic. Swamiji would often talk to himself. Sometimes the very words, which he was uttering to himself, became the answers to the devotees who prayed for his blessings.
He was often silent and to this silent saint, came people from all parts to have his ‘Darshan.’ Among them were the well-known saints, Sri Siddarudha of Hubli and Sri Sai Baba of Shirdi.
Sri Rudhramuniswamy of Halvi charanagiri Mutt, a great yogi himself, took ‘darshan’ of Sri Yerrithatha on his way to Uruvakonda.
Sri Padagacheri Ramalinga Swamy, a great saint of South India (Kumbakonam-Tamil Nadu) was one such person who became a devotee of Sri Yerrithatha. Sri Ramalinga Swamy, used to say that Chellaguriki would become the ” Kadir Kamam of North.” (Kadir Kamam-Sri Lanka-famous Murugan (Karthik swamy) Temple)


His last days

The Swamiji shuffled His mortal coil at 10′clock in the morning on the fourth day of the month of Jyesta Suddha in the year of Dundhubhi corresponding to 1922 AD at Chellagurki, Bellary


1(Chellagurki is a village on the Bellary – Anantapur Road. 40 kms from Anantapur by road. Andhra Pradesh. Anantapur (Mumbai- Bangalore railway route)


Read more...

Wednesday 22 August 2012

పద్యము

1 comments

ధరణీ కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి
స్ఫురితోదార కుఠారధార గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేడగా నిచ్చి తా
జిరకీర్తిన్ జమదగ్ని రాముడన మించెం దాపసేంద్రోత్తమా !

పోతన భాగవతము ౨/౧౫౩ 



Read more...

Saturday 18 August 2012

పద్యము

0 comments

నారద మహర్షి
`ధర్మము లెన్నియన్నియును ధారుణిలో వివరించినావు, ని
ష్కర్ములు యోగిసత్తము లకారణ మెవ్విభు నెల్ల వేళలన్
అర్మిలిమ్రొక్కి కీర్తనల నర్చనసేయుదు రట్టి మాధవున్
ధర్మధురీణ, సన్నుతు లొనర్పవు దానన లోటు వాటిలెన్'.

అంటూ వేద వ్యాసుని మనో వికలతకు కారణ మెరింగించి,


`చిత్తమునందు శ్రీ విభుని జేర్చి భజింపుము, విష్ణులీలన్

హత్తగనిమ్ము నీ యెడద, నాత్మ హరింగను, కృష్ణ వర్ణనా
యత్తము సేయు నీ పలు, కనంత జనంబు తరించినట్లు లో
కోత్తర కీర్తి చెప్పుము బుధోత్తమ, భాగవతాఖ్య సంహితన్'.

కవిసమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి   

Read more...

Akka Mahadevi

0 comments
Read more...

Friday 17 August 2012

పొలాల అమావాస్య

1 comments

ఈరోజు పొలాల అమావాస్య మా ప్రాంతంలో ఎద్దులకి పూజ చేస్తారు.
వ్యవసాయం లేనివారు మట్టితో ఎద్దు బొమ్మలని చేసి పూజిస్తారు
తరువాత స్త్రీలు పూర్ణం భక్ష్యాలతో మొదటగా శ్రీకృష్ణుడికి వాయనం ఇచ్చి
తరువాత వారి సంతానానికి వాయనం ఇస్తారు. తరువాత భుజించి,
సాయంకాలము గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి,
గ్రామస్తులంతా ఎద్దులబండిలతో ప్రదక్షిణ చేసి జాతర జరుపుకుంటారు.
ఇది ప్రాంతీయ ఆచారం.
Read more...

Saturday 11 August 2012

Nine Beliefs of Hinduism Aum symbol

2 comments

Nine Beliefs of Hinduism
Aum symbol



Our beliefs determine our thoughts and attitudes about life, which in turn direct our actions. By our actions, we create our destiny. Beliefs about sacred matters--God, soul and cosmos--are essential to one's approach to life. Hindus believe many diverse things, but there are a few bedrock concepts on which most Hindus concur. The following nine beliefs, though not exhaustive, offer a simple summary of Hindu spirituality.

Hindus believe in a one, all-pervasive Supreme Being who is both immanent and transcendent, both Creator and Unmanifest Reality.
Hindus believe in the divinity of the four Vedas, the world's most ancient scripture, and venerate the Agamas as equally revealed. These primordial hymns are God's word and the bedrock of Sanatana Dharma, the eternal religion.
Hindus believe that the universe undergoes endless cycles of creation, preservation and dissolution.
Hindus believe in karma, the law of cause and effect by which each individual creates his own destiny by his thoughts, words and deeds.
Hindus believe that the soul reincarnates, evolving through many births until all karmas have been resolved, and moksha, liberation from the cycle of rebirth, is attained. Not a single soul will be deprived of this destiny.
Hindus believe that divine beings exist in unseen worlds and that temple worship, rituals, sacraments and personal devotionals create a communion with these devas and Gods.
Hindus believe that an enlightened master, or satguru, is essential to know the Transcendent Absolute, as are personal discipline, good conduct, purification, pilgrimage, self-inquiry, meditation and surrender in God.
Hindus believe that all life is sacred, to be loved and revered, and therefore practice ahimsa, noninjury, in thought, word and deed.
Hindus believe that no religion teaches the only way to salvation above all others, but that all genuine paths are facets of God's Light, deserving tolerance and understanding.
Hinduism, the world's oldest religion, has no beginning--it precedes recorded history. It has no human founder. It is a mystical religion, leading the devotee to personally experience the Truth within, finally reaching the pinnacle of consciousness where man and God are one. Hinduism has four main denominations--Saivism, Shaktism, Vaishnavism and Smartism. For more information, see the sidebar at right.




Read more...

Friday 10 August 2012

పురాణ’ పురుషుడు: బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రి గారు

0 comments

బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రి గారు

తల్లిదండ్రులు: దక్షిణామూర్తిశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ
ఎక్కువగా ప్రభావం చూపినవారు: పితామహులు (తాతగారు) రామకృష్ణ చయనులవారు
చదువు: వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యం...
భార్య: సీతారామ ప్రసన్న

సంతానం: ఆరుగురు మగ పిల్లలు... రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి; ఇద్దరు ఆడపిల్లలు... ఆదిలక్ష్మి, సరస్వతి. కొడుకులందరూ వారికి నచ్చిన చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కుమార్తెలు గృహిణులు. అల్లుళ్లు దెందుకూరి నర్సింహమూర్తి, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి. ఒకరు జేఎన్టీయూలోనూ, మరొకరు ఎల్.ఐ.సీలోనూ ఉన్నతోద్యోగులు. పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్‌గా రిటైరైతే మరో అబ్బాయి రాఘవ బుల్లితెర నటుడు.

పురాణాలతోబాటు నేను జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాలు చదివాను. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుంటే చూసి ఆనందిస్తుంటాను. ప్రతిరోజూ వేదపారాయణం చేస్తుంటాను.

ఇటీవల పత్రికలతో సహా ప్రతి ఒక్కరూ పురాణ కాలక్షేపం అనే మాటను వాడుతున్నారు. అది శుద్ధ తప్పు. పురాణప్రవచనం అనాలి తప్పితే పురాణ కాలక్షేపం అనకూడదు. కాలక్షేపం ఏమిటి? అలా అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లే!

పురాణ’ పురుషుడు:

ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!
ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!
ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారని!
ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...
మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.
ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.
మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.
తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.
నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.
ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.
నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.
దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!
కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.
స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.
ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.
వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!
బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.
అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.
నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.
నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.
ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.
ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.
అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.
భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.
ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.
అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!
సేకరణ:సాక్షి ఫన్ డేపురాణ’ పురుషుడు:


ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!
ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!
ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారని!
ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...
మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.
ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.
మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.
తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.
నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.
ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.
నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.
దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!
కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.
స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.
ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.
వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!
బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.
అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.
నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.
నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.
ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.
ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.
అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.
భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.
ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.
అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష! 


సేకరణ:సాక్షి ఫన్ డే


Read more...

జ్ఞానం

0 comments

జ్ఞానం గురించి సంస్కృతంలో ఋషులు చాలా తక్కువ రాసారు.
ఎందుకంటే జ్ఞానం అనేది కేవలం అనుభవైకవేద్యం తప్ప విని,
చదివి తెలుసుకోగలిగేదికాదు. శుద్ధ మనస్సులోనే జ్ఞానం తనంతట
తాను ఉదయిస్తుంది తప్ప భక్తి భావంలా జ్ఞాన భావాన్ని ఎవరూ ఎవరిలోనూ
ప్రవేశపెట్ట లేరు. " భక్తి పరాకాష్టే జ్ఞానం ". జ్ఞానం పరాకాష్టే ఆత్మ సాక్షాత్కారం.
సంపూర్ణ జ్ఞానే తాను పరబ్రహ్మం అని తెలుసుకున్న వ్యక్తి. జ్ఞాన మార్గం కన్నా
మొదట్లో భక్తి, ధ్యాన మార్గాలు మంచివి. అవే జ్ఞానాన్ని చేకూర్చుతాయి.







 
Read more...

Monday 6 August 2012

పద్యము

0 comments

పరమభాగవతులు పాటించు పథమిది, యీ పథమున యోగి యేగె నేని
మగుడి రాడు వాడు మఱి సంశయము లేదు, కల్పశతము లైన గౌరవేంద్ర!

శుకుడు పరీక్షిత్తుతో  పోతన భాగవతము ౨/౩౩ 
  
Read more...

శ్రీ వేద వ్యాస అష్టోత్తర శత నామావళి

0 comments


శ్లో || కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం 
       వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం


శ్లో ||  నారాయణం నమస్కృత్య - నరం చైవ నరోత్తమం
        దేవీం సరస్వతీం చైవ - తతో జయ ముదీరయేత్ ||




1.ఓం వ్యాసాయ నమః
2..ద్వైపాయనాయ నమః
3..శ్రేష్ఠాయ నమః
4..సత్యాత్మనే నమః
5..బాదరాయణాయ నమః
6..మునయే నమః
7..సత్యవతీ పుత్రాయ నమః
8..శుక తాతాయ నమః
9..తపోనిధయే నమః
10..వశిష్ఠనప్త్రే నమః
11..సర్వజ్ఞాయ నమః
12..విష్ణు రూపాయ నమః
13..దయానిధాయే నమః
14..పరాశరాత్మజాయ నమః
15..శాంతాయ నమః
16..శక్తిపౌత్రాయ నమః
17..గుణాంబుధయే నమః
18..కృష్ణాయ నమః
19..వేదవిభక్త్రే నమః
20..బ్రహ్మసూత్రకృతే నమః
21..అవ్యయాయ నమః
22..మహాయోగీశ్వరాయ నమః
23..సౌమ్యాయ నమః
24..ధన్యాయ నమః
25..పింగజటాధరాయ నమః
26..చీరాజినధరాయ నమః
27..శ్రీమతే నమః
28..అష్టాదశపురాణకృతే నమః
29..దండినే నమః
30..కమండలధరాయ నమః
31..కురువంశప్రవర్ధకాయ నమః
32..నిర్మమాయ నమః
33..నిరహంకారాయ నమః
34..నిష్కళంకాయ నమః
35..నిరంజనాయ నమః
36..జితేంద్రియాయ నమః
37..జితక్రోధాయ నమః
38..స్మృతికర్త్రే నమః
39..మహాకవయే నమః
40..తత్త్వ జ్ఞానినే నమః
41..తత్త్వబోధకర్త్రే నమః
42..కాశీనివాసభువే నమః
43..మహాభారత కర్త్రే నమః
44..చిరంజీవినే నమః
45..మహామతయే నమః
46..సజ్జనానుగ్రహపరాయ నమః
47..సత్యవాదినే నమః
48..ధృఢవ్రతాయ నమః
49..బదర్యాశ్రమసంచారిణే నమః
50..కోటిసూర్యసమప్రభాయ నమః
51..త్రిపుండ్రవిలసత్ఫాలాయ నమః
52..అష్టావింశతి రూపభ్రుతే నమః
53..రవీందుమిత్రశిష్యాడ్యాయ నమః
54..సుశీలాయ నమః
55..యతిపూజితాయ నమః
56..వైయ్యాఘ్రచర్మవసనాయ నమః
57..చిన్ముద్రావిలసత్కరాయ నమః
58..రుద్రాక్షమాలాభూషాడ్యాయ నమః
59..కలిపాపనివారకాయ నమః
60..ధర్మాశ్వమేధసందేష్ట్రే నమః
61..సంజయజ్ఞానదృష్టిదాయ నమః
62..ద్రుతరాష్ట్రపుత్రదర్శినే నమః
63..విదురాదిప్రపూజితాయ నమః
64..పుత్రమోహవ్యాకులాత్మనే నమః
65..జనకజ్ఞానదాయకాయ నమః
66..కర్మఠాయ నమః
67..దీర్ఘ దేహాడ్యాయ నమః
68..దర్భాసీనాయ నమః
69..వరప్రదాయ నమః
70..యమునాద్వీపజననాయ నమః
71..మోక్షోపాయప్రదర్శకాయ నమః
72..ఋషిపూజ్యాయ నమః
73..బ్రహ్మనిధయే నమః
74..శిఖావతే నమః
75..జటిలాయ నమః
76..పరాయ నమః
77..అష్టాంగయోగనిరతాయ నమః
78..గాంధారీగర్భసంరక్షకాయ నమః
79..పాండవప్రీతిసంయుతాయ నమః
80..వసుభూపాలదౌహిత్రాయ నమః
81..వ్యాసకాశీసదావాసాయ నమః
82..నరనారాయణార్చకాయ నమః
83..నిత్యోపవాససంతుష్టాయ నమః
84..పరహింసాపరాన్గ్ముఖాయ నమః
85..శివపూజైకనిరతాయ నమః
86..సురాసురసుపూజితాయ నమః
87..సర్వక్షేత్రనివాసినే నమః
88..సర్వతీర్ధావగాహనాయ నమః
89.. యుధిష్ఠిరాభిషేక్త్రేనమః
90..స్మృతిమాత్రాప్తసన్నిధయే నమః
91..త్రికాలజ్ఞాయ నమః
92..విశుద్దాత్మనే నమః
93..నిర్వికారాయ నమః
94..నిరామయాయ నమః
95..ఊర్ధ్వరేతసే నమః
96..మాతృభక్తాయ నమః
97..నిశ్చింతాయ నమః
98..నిర్మలాశయాయ నమః
99..రూపాంతరచరాయ నమః
100..పూజ్యాయ నమః
101..సదా శిష్యసమావృతాయ నమః
102.. భిక్షేశ్వర ప్రతిష్ఠాత్రే నమః
103..నిరవద్యాయ నమః
104..నిరంకుశాయ నమః
105..సర్వభూతహృదావాసాయ నమః
106..సర్వేష్టార్ధప్రదాయకాయ నమః
107..సర్వలోకగురవే నమః
108 ..సచ్చిదానందజ్ఞాననిధయే నమః
Read more...

Saturday 4 August 2012

Barabar Caves

0 comments
 
Barabar Caves are situated in Barabar Hills, at a distance of approximately 20-25 km to the north of Gaya, Bihar. These hills are famous for the four rock cut caves that are sited here. Dating back to the 200 BC, these caves were constructed during the reign of Emperor Ashoka, for the Ajivikas. Carved out of a huge granite rock, these caves look as if they are cut with a laser. The caves were desi
gned in a way that they look like wood.

Out of the four caves, the most significant one is the Lomas Rishi Cave. The facade of the cave has been based on the architecture of the thatched huts, which used to house ascetics in the ancient period. The interiors of the cave consist of a big rectangular chamber, adorned with amazing glass-like polish. The nearby Nagarjuni Hill also consists of two caves, namely Sudama and Chaupar. Founded by Ashoka's grandson, these caves boast of polished interiors, but plain exteriors.
Read more...

Thursday 2 August 2012

HEART CENTRE

0 comments
HEART CENTRE

With reference to the location of the Heart Centre on the right side of the human body, Sri Bhagavan said: I had been saying all along that the Heart centre was on the right, not withstanding the refutation by some learned men that physiology taught them otherwise.

I speak from experience.


I knew it in my home during my trances.
Again during the incident related in the book Self Realization, I had a very clear vision and experience. All of a sudden a light came from one side erasing the world vision in its course until it spread all round when the vision of the world was completely cut out. I felt the muscular organ on the left had stopped work; I could understand that the body was like a corpse, that the circulation of blood had stopped and the body became blue and motionless.
Vasudeva Sastri embraced the body , wept over my death, but I could not speak.
All the time I was feeling that the Heart Centre on the right was working as well as ever. This state continued 15 or 20 minutes. Then suddenly something shot out from the right to the left resembling a rocket bursting in air. The blood circulation was resumed and normal condition restored.
I then asked Vasudeva Sastri to move along with me and we reached our residence.
The Upanishada say that 101 nadis terminate in the Heart and 72000 originate from them and traverse the body. The heart is thus the centre of the body. It can be centre because we have been accustomed to think that we remain in the body. In fact the body and all else are in that centre only.
(Spirutual Heart :by Shri A.R. Natarajan) 


Alan Jacobs


Paritala Gopikrishna Gari Sahakaramtho.
Read more...

DIFFICULTIES

0 comments

DIFFICULTIES

Sri Bhagavan said that a saint Namah Sivaya who was formerly living in Arunachala must have undergone considerable difficulties. For he has sung a song saying: "God proves the devotee by means of severe ordeals. A washerman beats the cloth on a slab, not to tear it, but only to remove the dirt."

source: Talk 447


Om Namo Bhagavate Sri Ramanaya
Read more...

Wednesday 1 August 2012

లక్ష్మీ స్తోత్రం పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

5 comments


లక్ష్మీ స్తోత్రం



పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్వ లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా వెతుకుతున్నాను.
అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ 



క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే 


ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్ 


సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః 


కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే 


వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః 


కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే 


కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ 


పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే 


కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే 


ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః 


ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్ 


అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్ 


పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ 


పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్ 


హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్ 


సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం || 





సుందర్ రాజ్ ప్రియ గారి సహకారంతో..


 



Read more...

భక్తి గీతం

0 comments

నిర్దోషంబగు కర్మాచరణము
నిశ్చల భక్తిలో తన్మయ భావము
నిస్సంకల్పిత ధ్యాన విధానము
నిఖిలాదీశ్వర ప్రసాదించరా

అనవరతము నీ నామము తలచగ
ఆత్మలోన నీ మూర్తిని నిలుపగ
సర్వజీవులను దైవ రూపముగ
ఆరాధించెడు దశ నొసంగురా

ధర్మ మార్గమున జీవిత కాలము

ధైర్యముతో నడుచునట్లుగ
కర్మాధీశ్వర ఇంద్రియములను
క్రమపద్ధతిన నడిపింపుమురా

సత్యము శాంతము సహన మహింసయు
సమతా భావము సహజ విరాగము
సంకటములలో సౌమ్య విధానము
సర్వాధీశ్వర దయ చేయుమురా

నీవే తల్లివి నీవే తండ్రివి

నీవే గురువవు నీవే దైవము
నీవే తప్ప నాకితరము లేదని
నిన్నే నమ్మితి నన్ను బ్రోవరా

శ్రీ ప్రసన్నానంద స్వామి

సేకరణ
పరంజ్యోతి
మల్లాది వేంకట కృష్ణమూర్తి గారి ఆధ్యాత్మిక నవల

శుభోదయం 
--
శ్రీ హరికృష్ణ శాస్త్రి  
Read more...