Saturday 24 December 2011

విశ్వామిత్ర

0 comments
బ్రహ్మతేజోబలంబు రూపము ధరించి,
బ్రహ్మసృష్టికి ప్రతిసృష్టి పరగజేసి,
మంత్రగాయత్రి దర్శించి మహిమ జూపు, 
బ్రాహ్మణుండ! విశ్వామిత్ర! భక్తి గొలుతు !!
Read more...

Monday 7 November 2011

0 comments

సాక్షాత్తు శివున్నే ధరించినవాడు ఎవ్వడు? శివుడు గజ చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? అనే విషయాలను ఈ కథ సందర్భం తెలియచేస్తుంది. పూర్వం కుమారస్వామితో తారకాసుర వధ జరిగిన తరువాత లోకాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. తరువాత అదే తారకాసుర వంశంలో జనించిన వాడే గజాసురుడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలు పొంది మూడులోకాలను జయించి వాటిని పాలించసాగాడు. ఇది దేవతలకు ఇబ్బందిగా పరిణమించింది. అంతేకాక గజాసురుడు గొప్ప శివభక్తుడు. ఇతడు నిత్యం శివారాధన చేసేవాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు గజాసురుడి కొలువుకి వచ్చి గజాసురుడి మర్యాదకు ప్రసన్నుడై, నిరంతర శివభక్తి కలిగిన నీవు స్వయం శివున్నే నీ హృదయాన ప్రతిష్టించుకో...అని సూచన చేసాడు. ఇది గొప్ప అదృష్టమని నారదుడు అనడంతో గజాసురుడు వెంటనే పరమేశ్వరుని గురించి గొప్ప తపమాచరించి శివున్ని ప్రసన్నం చేసుకొన్నాడు. అప్పుడు గజాసురుడు శివున్ని వినమ్రంగా నమస్కరిస్తూ, నివోకచోట నేనోకచోట ఉండడం భావ్యం కాదని నిరంతరం తన హృదయంలో ఉండిపొమ్మని కోరుకున్నాడు. భక్తవత్సలుడైన శివుడు అనుగ్రహించి లింగరూపాన్ని ధరించి గజాసురుడి హృదయంలోకి ప్రవేశించాడు.
రుద్రుడు లేక కైలాసం కల్లోలమైంది. రుద్రగణాలు, ప్రమథగణాలు వెతికి నీరసించిపోయాయి. తిరిగి చేసేది లేక పార్వతిదేవి విష్ణువుని ఆశ్రయించింది. విష్ణువు పార్వతికి అభయమిచ్చి,ఓదార్చి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడికే ఇంద్రాది దేవతలను రప్పించి, వారంతా ఒక గంగిరెద్దుల ఆట ఆడించే వారిలా మారు వేషాలు ధరించి గజాసురుడు ఉండే షోణితపురానికి వెళ్ళారు. ఆ ఆటలో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మ సన్నాయిని వాయించే వాడుగా, ఇంద్రుడు జేగంట కొట్టే వాడుగా, భ్రుంగి వీరణాలు వాయించే వాడుగా వీధుల్లో తిరుగుతూ గజాసురుడి మందిరానికి చేరుకున్నారు. వారు పాడే శివభక్తి గీతాలకు గజాసురుడు ప్రసన్నుడై వారిని పిలిపించి గేయాలను పాడించుకున్నాడు.
ఆ గేయాలను వింటున్న పరమశివుడు ఆనందిస్తూ, గంగిరెద్దు నాట్యం చూస్తూ తన రూపాన్ని పెంచాసాగాడు. ఇది గమనించిన గజాసురుడు తనకు మరణం తప్పదని భావించి శివున్ని శరణువేడాడు. అప్పుడు శివుడు గజసురుదితో, నీ మరణం ఆసన్నమైనదని ఇంకేదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు గజాసురుడు తన శిరస్సు పూజార్హత కలిగి ఉండేలా, తన చర్మం శివుడు ధరించేలాగా, జన్మరాహిత్యం కలిగేల వరం ప్రసాదించమని వేడుకొన్నాడు. శివుడు ఆ కోరికను మన్నించి త్రిశులదారియై గజాసురుడి పొట్టను చిల్చుకొని బయటికి వచ్చాడు. తరువాత గజాసురుడి తలను భద్రపరిచారు. గజాసురుడి చర్మాన్ని ధరించి శివుడు గజచర్మాంబరదారిగా ప్రసిద్దికెక్కాడు. గజాసుర సంహారంతో దేవతలంతా సంతోషించారు.

Read more...

Monday 24 October 2011

0 comments

శ్రీ శంకరా! దేవ! శ్రీ కంధరా! శైవ సద్భావనా పూర! సద్భక్త సద్బుద్ధి సంచార! సాకార! ఓంకార! గంభీర! శ్రీ భావజాకార సంహార! జ్యోత్స్నాకరావాస సత్కేశ సంపన్న యోగీశ్వరా! భృంగి సంగేశ్వరా! లింగ రూపేశ్వరా! తుంగ గంగాధరా! శ్రీ హరా! పార్వతీ దేవి ప్రాణేశ్వరా! రాజ రాజేశ్వరా! శీత శైలేశ్వరా! శాత శూలేశ్వరా! భూత జాలేశ్వరా! రుద్ర భూమీశ్వరా! రౌద్ర కాలేశ్వరా! భద్ర కాళీశ్వరా! ఫాల నేత్రేశ్వరా! భవ్య నామేశ్వరా! దివ్య ధామేశ్వరా! సర్వ కామేశ్వరా! సప్త లోకేశ్వరా! నాయకా! నర్తనానంద సంధాయకా! నాగ రాజేంద్ర సద్భూషణా! భీషణా! పోషణా! శ్రీ శివా! శ్రీ భవా! శ్రీశ! కోటీశ్వరా! శ్రీ త్రికూటేశ్వరా! భూరి విశ్వేశ్వరా! పాహిమాం! పాహిమాం! పాహి సర్వేశ్వరా!
Read more...

Wednesday 21 September 2011

తంత్రసార:

0 comments
స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ |
అథవా  నిష్కలం ధ్యాయే   త్సచ్చిదానంద   లక్షణమ్ ||
                                                          తంత్రసార: 

स्त्री  रूपाम्  चिन्तये  द्देवीं  पुंरूपं वा   विचिन्तयेत
अथवा   निष्कलं   ध्याये  त्सच्छिदानन्द   लक्षणं ॥
                                                      तन्त्रसार :

 

Read more...

Friday 19 August 2011

దేవీ స్తుతి

0 comments

యా దేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు చాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
Read more...

Sunday 7 August 2011

ముగురమ్మల మూలపుటమ్మ

0 comments

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనము్మల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌


 
అని బమ్మెర పోతనామాత్యుడు పరాత్పర అయిన ఆ ఆదిశక్తిని ఆరాధించాడు. భారతీయ ఆధ్యాత్మిక భావ భూమిక మహాశక్తి ప్రాతిపదికనే ఏర్పడింది. ఈ విశ్వంలో సమస్త సృష్టికి ఆమెయే చైతన్యం. ఆమెయే బుద్ధి, ఆమెయే నిద్ర.. మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. త్రిమూర్తులైన సృష్టి, స్థితి, లయకారకులకు అమ్మవారే ఆలంబన. ఆమె శక్తి.. ఆమే సంపద.. ఆమే విద్య. దశమహా విద్యలకు అధిదేవత ఆమె. మృత్యువుకు, జరామరణాలకు అందనంత ఎత్తులో, అనంతమైన ఆనందామృత స్థితికి ఆమె అధినాయిక. రామాయణ, మహాభారతాలకు స్త్రీమూర్తే కేంద్ర బిందువై దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించింది. మహిషాసుర, నరకాసురాది అసుర శక్తుల సంహార విధుల్ని నిర్వర్తించింది. మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన స్త్రీమూర్తిని ఆరాధించడం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అనేక స్థాయిల్లో, అనేక దశల్లో, అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అధోలోకం నుంచి ఊర్ధ్వలోకాల దాకా అనేక అంశల్లో అమ్మవారు పూజలందుకుంటుంటారు. తెలంగాణ ప్రాంతంలో చెరువు కట్టల వద్ద నెలకొన్న కట్టమైసమ్మ, గండి మైసమ్మ రూపాల నుంచి.. వారణాసిలో అన్నపూర్ణాదేవి వరకూ అనేక రూపాలలో అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న దేవీ ఆలయాల్లో మైసూరు సమీపంలోని చాముండేశ్వరీ దేవి ఆలయం మూర్తీభవించిన మహా శక్తి తత్తా్వనికి ప్రతీక. మైసూరు మహారాజా వారి రాజమందిరానికి, దసరా ఉత్సవాలకు మాత్రమే ప్రఖ్యాతి కాదు.. అంతకుమించి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. మైసూరుకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఎతై్తన కొండపై చాముండేశ్వరి దేవాలయం విరాజిల్లుతోంది. ఈ కొండ సైతం అమ్మవారి పేరుతోనే సార్థకమైంది. మైసూరు పట్టణం నుంచి చాముండి కొండవైపు చూస్తే అత్యద్భుతంగా కనిపిస్తుంది. మైసూరు సంస్థానాన్ని పరిపాలించిన మహారాజులంతా ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి పరిచారు. దాదాపు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనదైన ఈ ఆలయానికి 1794-1860 వరకు మైసూరును పాలించిన కృష్ణరాజ వొడియార్‌ అమ్మవారికి మహారాజ గోపుర నిర్మాణాన్ని గావించారు. ద్రవిడ సంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ గోపురం సుమారు నలభై అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు వేల అడుగులకు మించిన ఎత్తుండటం వల్ల చాముండి కొండ మైసూరు పట్టణానికే తలమానికంగా నిలిచింది. కాలిబాటన వెళ్లాలంటే ఈ కొండకు అక్షరాలా వెయ్యి మెట్లు ఎక్కాలి. గుడికి వెళ్లడానికి ఘాట్‌రోడ్డును కూడా నిర్మించారు. వెండి తొడుగుతో నిర్మించిన చాముండేశ్వరీదేవి ఆలయ ప్రధాన ద్వారంపై అమ్మవారి వివిధ అంశలు, పౌరాణిక గాధల చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక గర్భగుడి సంగతి చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు. మొత్తం పసిడి కాంతులు వెదజల్లుతుండే అమ్మవారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. సాక్షాత్తు ఆదిశక్తి స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాబట్టి గర్భగుడిలో ప్రవేశించగానే ఆమె ఆప్యాయంగా భక్తులను పలుకరిస్తుంది. ఆమె ప్రసన్న దృక్కులు భక్తుల మనసులను పరిశుద్ధి చేస్తాయి. ఆ కాలంలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజించారు. ఆలయ సమీపంలో అతి పెద్ద మహిషాసురుడి విగ్రహం సైతం కనిపిస్తుంది. ఈ కొండపైనే మహిషాసురుని అమ్మవారు వధించారని స్థల పురాణం చెప్తుంది. మైసూరు పట్టణమే శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంటే అందుకు కారణం చాముండేశ్వరి దేవి అనుగ్రహమే. అంతేకాదు.. ఇక్కడ శివకేశవులకు కూడా ఎలాంటి భేదం లేకుండా పూజలు జరుగుతాయి. శివుడిని మహాబలేశ్వరుడిగా, విష్ణువును నారాయణుడిగా పూజిస్తారు. ఆలయానికి వెళు్తంటే మార్గమధ్యంలో మహా నందీశ్వరుడి విగ్రహం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు అయిదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల పొడవున్న గొప్ప విగ్రహం ఇది. ఇది పేరుకు విగ్రహమే అయినా, సజీవంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే, ఈ విధంగా జీవంతం చేయడమే అని చెప్పవచ్చు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, మన రాష్ట్రంలోని లేపాక్షి ఆలయంలోని నందీశ్వరులతో సమాన స్థాయిలో ఉన్న బృహన్నంది ఇది.
ఈ కొండకు దక్షిణం వైపున మార్కండేశ ముని ఆశ్రమం ఎంతో ప్రశాంత వాతావరణంలో మనకు కనిపిస్తుంది. దీనికి సమీపంలో జ్వాలాముఖి త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ కొండపైన ఎప్పటికీ నిండుకోని పవిత్ర జలాశయాలు రెండు ఉన్నాయి. ఒకటి దేవ గంగ కాగా.. మరొకటి పాతాళ వాహిని. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఈ రెంటిలో పవిత్ర స్నానాలు చేస్తారు.
ఈ ఆలయ సందర్శనం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఎతై్తన కొండపై అంతకంటే ఎత్తున, అద్భుత నిర్మాణ రీతిలో అలరారే ఆలయాన్ని చూడటానికి వేయి కన్నులు చాలవు.


ఈ విధంగా అమ్మవారిని సేవించిన వారికి

"రాజ్యమర్థించు వారికి రాజ్యమబ్బు

విద్య నర్థించు వానికి విద్యయబ్బు
స్వర్గమర్థించువానికి స్వర్గమబ్బు
మోక్షమర్థించువానికి మోక్షమబ్బు"
Read more...

Thursday 4 August 2011

ఆధ్యాత్మిక సాధనకు మూలం నమ్మకం

1 comments


ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు అతన్ని విష్ణువును ప్రార్థించకుండా ఉండటానికి సర్వ విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ శ్రీ మహా విష్ణువు పట్ల అతనికున్న తిరుగులేని భక్తి విశ్వాసాల ముందు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతను చిన్నతనం నుంచే మహాఋషుల ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించేవాడు. తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి ఆమెకు విష్ణు ప్రవచనాలను వినిపిస్తుండేవాడు. ఆమె ఒక్కోసారి నిద్రపోయినా అవి గర్భంలో ఉన్న ప్రహ్లాదునిపై చెరగని ముద్ర వేశాయి.

ప్రహ్లాదుడు పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా, ప్రజల సమస్యల మీద అవగాహన కలగాలని హిరణ్యకశిపుడు అతన్ని ఇతర సైనికులతో పాటు గస్తీ తిరగమని పంపించాడు. ప్రహ్లాదుడు అలా తిరుగుతుండగా ఓ రోజు రాత్రి దూరంగా ఓ వైపు నుంచి పొగ, మంటలు రావడం గమనించాడు. దగ్గరికెళ్ళి చూస్తే ఓ కుమ్మరి తాను తయారు చేసిన కుండలు కాలుతూ ఉన్నాయి. అతను మాత్రం బాధ నిండిన ముఖంతో, ముకుళిత హస్తాలతో ఇలా ప్రార్థిస్తున్నాడు.
“దేవా! ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వనుకుంటే జరగనిది ఏదీ లేదు. హే భగవాన్! దయ ఉంచు. నేను అజాగ్రత్త పరుణ్ణే, కానీ నీవు దయామయుడవు. కరుణా సముద్రుడవు! నీవొక్కనివే నా తప్పును మన్నించగలవు. నేనెంత దుర్మార్గుణ్ణైనా నీ వాడిని. నీ కృపతో ఏదైనా సాధ్యమే. ఆ పిల్లి కూనల్ని నువ్వే కాపాడాలి.”
అలా పదే పదే అనుకుంటూ ఆ కుమ్మరి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కుండల చుట్టూ మంటలు కమ్ముకుంటున్నాయి. ప్రహ్లాదుడికి ఇదంతా వింతగా, ఆశ్చర్యంగా అనిపించి అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు.
ప్రహ్లాదుడు: “ఏం జరిగింది? నువ్వేం చేస్తున్నావు?”
కుమ్మరి: “ఏం చెప్పమంటావు కుమారా! నేను కుండలు తయారు చేసి వాటిని కాల్చడానికి మంటల్లో వేశాను. వాటిలో ఒక కుండలో ఒక పిల్లి కొన్ని కూనలకు జన్మనిచ్చింది. మంటల్లో పెట్టడానికి ముందు వాటిని తీసేయాలనుకున్నాను కానీ మరిచిపోయాను. వాటిని మంటల్లో పెట్టేసి బాగా అంటుకున్న తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుడి దయ. ఆయన తలుచుకుంటే వాటిని కాపాడగలుగుతాడు. అందుకనే ఆయన్ను ప్రార్థిస్తున్నాను.” అన్నాడు
ప్రహ్లాదుడు: “ఇది కేవలం నీ మూర్ఖత్వం, పిచ్చితనం, మంటలు అంత పెద్దవిగా ఉంటే ఆ కూనలు ఎలా బ్రతుకుతాయి?”
కుమ్మరి: “నిజం రాకుమారా! భగవంతుడు తలుచుకుంటే తప్పకుండా బ్రతుకుతాయి. ఆయన తలుచుకుంటే ఓ చిన్న విత్తనం నుంచి మహావృక్షం మొలకెత్తుతుంది. మాతృమూర్తి గర్భంలోని ఓ చిన్న ద్రవ బిందువు నుంచి ఓ చక్రవర్తిని ఉద్భవింపజేయగలడు. ఓ నీటి చుక్క నుంచే నీవు-నేను, మంచి-చెడు అనే అంతరాలు ఉద్భవించాయి. ఇవన్నీ పరమాత్ముని లీలలు కాదా? ఆవు ఎండు గడ్డి తని తీయటి, తెల్లని పాలిస్తుంది. పాము పాలు తాగి విషాన్నిస్తుంది. తల్లి మామూలు ఆహారాన్ని పాలుగా మార్చి బిడ్డకు అందిస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద వారవగానే అలా తయారవడం ఆగిపోతుంది. ఇవన్నీ భగవంతుని యొక్క అంతులేని లీలలే!”
ప్రహ్లాదుడు: “సరే, మంటలు ఆరిపోయిన తర్వాత నన్నొకసారి పిలువు. ఆ కూనలు ఎలా బ్రతికుంటాయో చూడాలని ఉంది.”
కుమ్మరి: “చిత్తం రాకుమారా! మీరు రేపు వేకువ జామునే రండి. రేపే ఆ కుండల్ని తెరిచి చూపిస్తాను”
తర్వాతి రోజు ఉదయమే ప్రహ్లాదుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ కుమ్మరి కాసేపు ధ్యానం చేసుకుని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆ కుండలు తెరిచాడు. వాటిలో నాలుగు కుండలు సరిగా కాలలేదు. పచ్చిగా ఉన్నాయి. వాటిని తాకగానే నాలుగు పిల్లి కూనలు బయటికి దూకి పరిగెత్తాయి.
ప్రహ్లాదుని మనసులో ఎక్కడో దాగి ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జీవిత సారం భగవంతుడే అని గ్రహించాడు. దైవారాధన ప్రారంభించాడు. అతను విష్ణువును ఆరాధించడం చాలా మందికి నచ్చలేదు. అసుర రాజు పుత్రుడై ఉండి వారి బద్ధ విరోధి విష్ణువును ఆరాధించడమా? అని విమర్శించే వారు. కానీ ప్రహ్లాదుడు ఇవేమీ పట్టించుకోకుండా అచంచల భక్తితో విష్ణువును పూజిస్తూ ఉండేవాడు.అతని తండ్రి మొదట్లో కోప్పడ్డాడు. తర్వాత కొండల మీద నుంచి కిందకి తోయించాడు. సముద్రంలో పడవేయించాడు. ఏనుగులతో తొక్కించాడు. కానీ అవేవీ అతని విశ్వాసాన్ని కదిలించలేకపోయాయి.
భగవంతుని పై నిజమైన విశ్వాసాన్ని సాధించడం చాలా కష్టం. ఒక్కసారి నమ్మకం ఏర్పడ్డ తరువాత దాన్ని చివరి దాకా కొనసాగించడం కూడా కష్టమే. ఆ నమ్మకం అలాగే నిలిచి ఉన్నా ఆత్మ సాక్షాత్కారం పొందడం ఇంకా కష్టం.
ప్రహ్లాదుని చంపించడానికి హిరణ్యకశిపుడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ అతనికి హాని కలిగించలేకపోయాయి. ప్రహ్లాదుని మనసులో ఆలోచనంతా ఒకటే. “ఆ పిల్లి కూనల్ని రక్షించిన దేవుడు నన్ను రక్షించలేడా? నన్ను ఖచ్చితంగా కాపాడతాడు” అనుకొని పూర్తిగా భగవంతునికి సమర్పించుకున్నాడు. ప్రహ్లాదుని చంపడానికి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత హిరణ్య కశిపుడు బాగా ఎర్రగా మండుతున్న ఇనుప స్తంభం దగ్గరికి తీసుకెళ్ళి
“భగవంతుడు సర్వాంతర్యామి అంటావు కదా. అయితే ఆయన ఈ స్తంభంలో కూడా ఉంటాడు. వెళ్ళి దానిని కావలించుకో. ఎక్కడైనా ఉంటాడన్న మాట నిజమయితే ఇక్కడ కూడా ప్రత్యక్షమవుతాడు” అన్నాడు.
ప్రహ్లాదుడు మనస్పూర్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఆ స్తంభాన్ని కావలించుకున్నాడు. అప్పుడే అక్కడ నరసింహ మూర్తి ప్రత్యక్షమయ్యాడు.హిరణ్యకశిపుని తన వాడి గోళ్ళతో వధించాడు.

భౌతికవాదం బాగా వ్యాప్తి చెందినపుడు, సామాన్యులు కౄరపాలకుల బారిన పడ్డప్పుడు భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తుంటాడు. హిరణ్యకశిపుడ్ని సంహరించిన తరువాత అతన్ని తన ద్వారపాలకునిగా మునుపటి స్థానానికే (వైకుంఠానికే) రప్పించుకున్నాడు. ప్రహ్లాదుని చక్రవర్తిగా చేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.
ప్రహ్లాదుడు భగవంతుని ఈ స్వరూపంలోనే చూడగలిగాడు కానీ నిజమైన భగవత్‌స్వరూపాన్ని తెలుసుకోలేదు. దాన్ని తెలుసుకోవడం కష్టం కూడా.
కొంత కాలం తర్వాత దానవుల గురువైన శుక్రాచార్యుడు, ప్రహ్లాదుని మనసులో చిన్న సందేహాన్ని రేకెత్తించాడు.
“ప్రహ్లాదా! ఆ విష్ణువు మీ తండ్రిని సంహరించాడు. నిన్ను రక్షించమని కోరావే కానీ మీ తండ్రిని సంహరించమని కోరలేదు కదా?” అన్నాడు.
“లేదు మా తండ్రిని చంపమని నేను కోరలేదు”
“నువ్వు అడకపోతే ఆయన మీ తండ్రిని ఎందుకు చంపినట్టు? మీ తండ్రి యొక్క కౄర మనస్తత్వాన్ని మార్చి ఉండచ్చు కదా! కానీ ఎందుకు చంపాడు?”
ప్రహ్లాదునికి విష్ణువుపై అపారమైన భక్తి ఉంది. కానీ మన నమ్మకాల్ని బలంగా కదిలించగల వాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఆ నమ్మకం అదృశ్యమైపోతుంది. ఓ ఆధ్యాత్మిక సాధకుడికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తారసపడుతుంటారు. ఎవరో ఒకరు కనిపించి మీరు నేర్చుకున్న గురుమంత్రం గురించో, మీరు పాటిస్తున్న ఆధ్యాత్మిక సాధనా పద్దతుల గురించో, ఎంచుకున్న గురువు గురించో, భగవంతుడి గురించో, ఉపన్యాసాల గురించో అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఒక వేళ అలాంటి వాళ్ళు ఎవరూ ఎదురవకపోయినా ఒక్కోసారి మన మనసులోనే అనుమానాలు రేకెత్తవచ్చు. అందుకే నమ్మకం ఎప్పటికీ అలాగే నిలిచి ఉండదు.
అలా ప్రహ్లాదుని నమ్మకం శుక్రాచార్యులు కదిలించగలిగాడు. ఆయన ప్రహ్లాదునితో అంటున్నాడు. ” విష్ణువు మీ తండ్రిని సంహరించాడు  కానీ నువ్వు అతన్ని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నావు. ఇది కేవలం నీ గుడ్డి నమ్మకం మాత్రమే!”
భక్తుడు ఎపుడైనా “గుడ్డి నమ్మకం” అనే మాట వినగానే దాన్ని ఆక్షేపించడానికి, అభ్యంతరం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని మనసులో అనుమానం అనే బీజం బలంగా నాటుకుందన్నమాట. అలా విన్న మాటలు ఎప్పుడో ఒకప్పుడు ప్రభావం చూపిస్తాయి.
అందుకనే గురు గీతలో ఒకచోట అంటాడు.

“ఎప్పుడైతే నీ గురువును విమర్శించిన వారి నాలుకను తెగ్గోయలేకపోతావో, నువ్వు అతన్ని నీ దగ్గరి నుంచి తరిమేయాలి. ఒక వేళ నువ్వు అలా చేయలేని పక్షంలో నీవే అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా నిష్క్రమించాలి.”
ప్రహ్లాదుడు శుక్రాచార్యునితో అంటున్నాడు.” మీరు అలా భావిస్తే సరే. నేను ఆ విష్ణువుపైన ఎలాగైనా పగ తీర్చుకుంటాను” అన్నాడు
ప్రహ్లాదుడు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసి విష్ణువును పిలవడానికి సిద్ధమయ్యాడు.
భగవంతుడెప్పుడూ తన భక్తులు దిగజారిపోవడం చూడలేడు. దయామయుడైన ఆ శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో ప్రహ్లాదుని కలవడానికి వచ్చాడు. అతను ప్రహ్లాదుని రాజప్రాసాద ప్రాంగణంలోకి ప్రవేశించగానే అక్కడున్న ఓ భటుడు,
“ఓయీ బ్రాహ్మణోత్తమా ఎవరు నీవు? ప్రహ్లాదుడిప్పుడు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు నీలాంటి సాధు బ్రాహ్మణులను చూడటం అంత మంచిది కాదు” అన్నాడు.
“ప్రహ్లాదుడు నాలాంటి సాధువులకు మంచి గౌరవాన్నిస్తాడని విన్నానే! నువ్వేమో నన్ను లోపలికే పంపనంటున్నావు?”
అప్పుడా భటుడు “ప్రహ్లాదుడు ఇప్పుడి మునుపటి లాగా కాదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. మా గురువర్యులు శుక్రాచార్యులు ఆయనకి అంతా వివరించారు. ఇప్పుడాయన ఆ విష్ణువుపై పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు సాధ్యమైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు” అన్నాడు.
“సోదరా! ఏమైనా కానీ నేను మాత్రం ప్రహ్లాదుడిని కలవకుండా వెళ్ళేది లేదు. నువ్వు నన్ను లోపలికి పంపించకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. అప్పుడు నీకు ఓ బ్రాహ్మణుని హత్య చేసిన పాతకం చుట్టుకుంటుంది” అన్నాడు.
అలా విష్ణువు ప్రహ్లాదుని రాజ భవనంలోకి ప్రవేశించి ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు.
” ప్రహ్లాదా! సుభిక్షంగా ఉందువు గాక!, నువ్వు మీ పితృహంతకుడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరుతున్నట్లున్నావ్!, నేను కూడా ఆయన వల్ల నాశనమైన వాణ్ణే” అంటూ ప్రహ్లాదుని కొన్ని మాయమాటలతో దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు.
ప్రహ్లాదుని బ్రాహ్మణుడిలా అడుగుతున్నాడు ” నీకు విష్ణువు ఎక్కడుంటాడో తెలుసా?”
ప్రహ్లాదుడు: “ఆయన సర్వాంతర్యామి. అందరి హృదయాల్లోనూ ఉంటాడు.”
బ్రాహ్మణుడు: ” ప్రహ్లాదా! అయితే అందరి హృదయాల్లోనూ ఉన్న అతన్ని ఎలా చంపగలవు? చూడబోతే నాకు మల్లేనే నీవు కూడా తెలివి తక్కువ వాడిలా ఉన్నావు. శుక్రాచార్యుని బోధలు విని దుష్ట ప్రతిజ్ఞ పూనినట్టున్నావు. నేను ఓ కట్టెను ఇక్కడ నాటుతాను. దాన్ని నీవు బయటికి లాగగలిగితే నీకు విష్ణువు జయించే శక్తి ఉన్నట్లు లెక్క.”
ప్రహ్లాదుడు పైకి లేచి ఒంటి చేత్తో ఆ కర్రను లాగడానికి ప్రయత్నించాడు. కుదర్లేదు. రెండు చేతులతో బలాన్నంతా ప్రయోగించాడు. వీలు కాలేదు. అలా ప్రయత్నం చేయగా చేయగా అతని ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. అహం నెమ్మదిగా చల్లారింది. ఆ బ్రాహ్మణుడెవరో సామాన్యుడు కాదని నిశ్చయించుకున్నాడు. ప్రహ్లాదుడు వాస్తవంగా నిజమైన భక్తుడే. కానీ పరిస్థితుల ప్రభావానికి లోబడి దారి తప్పాడు అంతే. అతని మనసు మళ్ళీ దారికి వచ్చింది. ఆ బ్రాహ్మణుని పట్ల గౌరవ భావంతో,
“ఓ బ్రాహ్మణోత్తమా! ఎవరు మీరు?”
విష్ణువు: “ఎవరిని వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు నన్ను పూర్తిగా తెలుసుకోలేరు. ఎవరైతే వాళ్ళ గురించి, నా గురించి ఎరుక కలిగియుండరో వాళ్ళు నీళ్ళపైన తేలియాడే రెమ్మ లాగా ఊగిసలాడుతూ ఉంటారు. చెడు ఆలోచనల బారిన పడి నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టుకున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా బాధ పడాల్సిందే.”
ప్రహ్లాదుడికి అప్పుడర్థమైంది వచ్చిన వాడు ఆ శ్రీ మన్నారాయణుడే అని. ఆయన పాదాలపై బడి క్షమాపణ కోరాడు. అప్పుడా శ్రీ హరి తన భక్తునిపై వాత్సల్యంతో,
“నేను నిన్ను క్షమించడం కాదు. నువ్వే నన్ను క్షమించు! ఇంతకు మునుపే నాపై యుద్ధం ప్రకటించావు కదా!” అన్నాడు.
ఒకసారేమో ప్రహ్లాదుని భక్తిని సడలించడానికి హిరణ్యకశిపుడు శత విధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో సారేమో శుక్రాచార్యుడు తియ్యటి మాటలతో ప్రహ్లాదుని మనసుని కలుషితం చేయగలిగాడు.
ప్రహ్లాదుని వంటి మహా భక్తుని నమ్మకమే కదిలిపోయినప్పుడు సాధారణ ఆధ్యాత్మిక సాధకులు ఎంత జాగరూకతతో ఉండాలో ఆలోచించండి!
Read more...

Dakshina murthy stotram దక్షిణామూర్తి స్తోత్రము

0 comments

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్
Read more...

veerabhadra stotram వీరభద్ర స్తోత్రం

5 comments
(సతీదేవి అగ్నికి ఆహుతి కాగా శివ భగవానుడు తాండవము చేసి క్రోధాగ్ని ఉట్టిపడ వీరభద్రుని సృజించి యజ్ఞమును ధ్వంసము చేయనియోగించగా శ్రీ వీరభద్రుని విజృంభణ).

జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ || (పల్లవి)

ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో |
రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో |
బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచునురిమిన శబ్దముతో |
పటుతర గర్జనలోప్పగ ' దక్ష పిపీలికమా! ఎటనుంటివిరా ' ? |
అనుచుచు కేకల వేయుచు గగన పధంబున ప్రస్ధితుడైతివిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

పదపద ఘాతమునందున మేఘము లెగురగ నక్షత్రంబులవే |
ధూళి కణంబులుగా పైకెగురుచు తారాధూమములుప్పతిలన్ |
భగ భగ మండెడి విస్ఫులింగములు కన్నుల వర్షముగా కురియన్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

నిను తిలకించిన దేవగణంబులు మనులును పరుగులు తీసిరిగా |
అదియె మహా ప్రళయంబదె వచ్చె నటంచుచు కేకలతో దిశలన్ |
మెలిదిరిగిన మీసములె కత్తులుగా ముఖమందున భీకరముల్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

ఋషులను సురలను పాదఘాతములఁ దన్నుచు వచ్చిన పాపముకై |
శివరహితంబగు క్రతువును చేయగ ఎంత పొగరనుచు గర్జనతో |
క్రతువున వెలిగెడి అగ్ని గుండమున ఉమ్మి వేసియట నార్పితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

దక్షుని శిరమును తెంచితివచ్చట ఖడ్గముతో నావేశముతో |
ఛీ ఛీ తుచ్చాయని గాండ్రించుచు వ్యాఘ్రమురీతిగ దూకులతో |
ఉగ్ర విహారము చేయగ బ్రహ్మయు, హరియు నుతింప నిలచితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

హే! కరుణార్ణవ ! దక్షుని జీవము నిచ్చితివప్పుడు శాంతుడవై |
విధి హరి యాచన మన్నించితివే దయతో నీ పదమందు పదన్ |
మేషముఖుండగు దక్షుడు నిన్ను నుతించగ వీరేశ్వర శరభా ! |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

హే! కరిమర్దన ! హే క్రతుఖండన ! హే విషకంధర! నందిపతే |
హే! శశిశేఖర! హే ఫణిభూషణ ! హే కాలాంతక! స్కందగురో |
హే ! వీరేశ్వర ! హే పరమేశ్వర ! హే లయ తాండవ ! ప్రమధపతే! |
త్వాం ప్రణమామి మహేశ్వర ! శంకర ! పాలయ కింకర మీశ్వరమామ్‌ ||

వీరంభజే - వీరభద్రం భజే - రౌద్ర వికటాట్టహాసంభజే
కాళీపతే - భద్రకాళీపతే - రౌద్ర వికటాట్టాహసంభజే
శ్రీ భద్రకాళీ సహితం వీరభద్రం నమామ్యహమ్ |
కులదేవం ప్రసూతాత రూపాన్తర మివస్ధితమ్‌ ||
Read more...

Thursday 28 July 2011

భరత మాత

0 comments

కొమ్మల మీది కోయిలలు
కుత్తుకలెత్తి  స్వతంత్ర  భావ సూ 
త్రమ్ముల కట్టసాగి  మమ
తన్ ప్రణయాంబర చిత్రశాలలున్
కమ్మని జీవితానుభవ
గాథలు స్వాదుకథాపదేశామా
ర్గమ్ములు కర్ణరంజకము
గా వినిపించెడు నేడు భారతీ!
Read more...

Thursday 7 July 2011

పుష్ప విలాపం

2 comments
కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది....

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా
మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కర్మ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భౄం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
ట్ళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు

గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరురో జుద్యాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కౄశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను.
Read more...

Wednesday 6 July 2011

వినాయకుడి ప్రార్ధనలు

0 comments
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!



శుక్లాంబరధరం విష్ణుం


శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే


తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే


(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయతే
Read more...

అన్నమయ్య కీర్తనలు, రచనలు

0 comments


సుప్రసిద్ధ తెలుగు కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో చెప్పాలంటే "అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే."


అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.


ఉదాహరణలు




అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥


అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥


చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥


కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
Read more...

భారత మాత

0 comments
దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ గీతాన్ని కాకినాద ప్రభుత్వ కళాశాలలొ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి విద్యార్దులకోసం కృష్ణశాస్త్రి వ్రాసారు.
 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!


జయ జయ జయ.....


జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!


జయ జయ జయ.......


జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!


జయ జయ జయ.......
Read more...

Friday 24 June 2011

ఈ అయిదు అమ్మవారి ప్రధానరూపాలు .

0 comments
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి






వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష ధాత్రి ,శోఖార్తి దు:ఖనాశిని ,శరణాగత దీనార్తపరిత్రాణపరాయణ ,తేజ:స్వరూప ,సర్వశక్తి స్వరూప ,సిద్ధేశ్వరి ,సిధ్ధరూప .సిద్ధిద ,బుద్ధి,నిద్ర క్షుత్తు,పిపాస ,చాయ,తంద్ర,దయ,స్మృతి ,జాతి,క్షామ్తి,భ్రాంతి,శాంతి,చేతన,తుష్టి ,పుష్టి లక్ష్మీ,ధృతి ,మాయ -----ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది

.




ఇక రెండవది శుధ్ధ శక్తి స్వరూప మహాలక్ష్మి . సర్వ సంపత్స్వరూప .సంపదధిష్టాత్రి ,పద్మ,కాంత ,దాంత, శాంత.సుశీల,సర్వ మంగళ,లోభకామ మోహ మదహంకార వివర్జిత భక్తానురక్త ,పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర ,ప్రియంవద ,సర్వాత్మిక , జీవనోపాయరూపిణి. వైకుంఠం లో ఈ మహాలక్ష్మి పతిసేవాపరాయణయై నివసిస్తూ ఉంటుంది . సర్వప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది . స్వర్గం లో స్వర్గ లక్ష్మిగా ,రాజులలో రాజ్య లక్ష్మిగా,గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది . పుణ్యాత్ములకు కీర్తిరూప ,నరేంద్రులకు ప్రభావరూప ,వైశ్యులకు వాణిజ్యరూప,పాపాత్ములకు కలహాంకురరూప .వేదాలలో హయరూపంగా వర్ణింపబడినది సర్వపూజ్య,సర్వ వంద్య.


ఇక మూడవరూపం వాగ్బుధ్ధివిద్యాజ్ఞానాధిష్టాత్రియైన సరస్వతి .సర్వవిద్యాస్వరూప ,బుధ్ధి కవిత,మేధ,ప్రతిభ,స్మృతి ,ఇత్యాదులన్నీ మానవులకుఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిధ్ధాంత బేధాలు అర్ధబేధాలు కల్పించేది ఈతల్లే .ఈవిడే .వ్యాఖ్యాస్వరూపిణి ,బోధస్వరూపిణి సర్వ సందేహ భంజని .విచారకారిణి ,గ్రంథ కారిణి,శక్తిరూపిణి,.సర్వసంగీత సంధాన తాళ కారణ రూపిణి ,విషయ జ్ఞాన వాగ్రూప ,ప్రతివిశ్వోపజీవని ,వ్యాఖ్యావాదకరి,శాంత .వీణాపుస్తకధారిణి ,శుద్ధసత్వరూప ,సుశీల,శ్రీహరిప్రియ,,హిమ,చందన.కుంద,ఇందు,కుముద,అంభోజసన్నిభ . రత్న జపమాలికతో శ్రీకృష్ణున్ని ధ్యానించే తప:స్వరూపిణి .తప:ఫలప్రద .సిద్ధవిద్యాస్వరూప .సర్వసిధ్ధి ప్రద . ఈ తల్లి లేకుంటే సర్వజనులు మూగవారవుతారు .



ఇక నాల్గవరూపం చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టానదేవత . సంధ్యావందనమంత్రతంత్ర స్వరూపిణి,ద్విజాతిజాతిరూప ,తపస్విని,జపరూప,బ్రహ్మణ్యతేజోరూప సర్వసంస్కారరూపిణి ,సావిత్రి,గాయత్రి ,బ్రహ్మప్రియ . ఆత్మశుద్ధికోసం సర్వతీర్ధాలు ఈతల్లి సంస్పర్షను కోరుకుంటాయి. శుధ్ధస్పటికవర్ణ,శుధ్ధ స్వరూపిణి పరమానంద ,పరమ,సనాతని పర బ్రహ్మస్వరూపిణి నిర్వాణప్రదాయిని బ్రహ్మతేజోమయి ,ఈతల్లి పాదధూళిసోకి జగత్తు పునీతమవుతున్నది.

ఇక అయిదవ రూపాన్ని వర్ణిస్తున్నాను నారదా! ఆలకించు.




అయిదవరూపం . పంచప్రాణాలకు అధిష్టానదేవత . పంచ ప్రాణ స్వరూపిణి ,ప్రాణాధికప్రియతమ ,అందరికన్నా అందగత్తె .సౌభాగ్యమానిని గౌరవాన్విత ,వామాంగార్ధస్వరూప ,తేజోగుణసమన్విత . పరాపరసారభూత ,పరమ. ఆద్య.సనాతని పరమానందరూపిణి ,,ధన్య,మాన్య,,పూజ్య, శ్రీకృష్ణునికి రాసక్రీఢాధిదేవత ,రాసమండల సంభూత,రాసమండల మండిత,రాసేశ్వరి,సురసిక ,రాసావాస నివాసిని ,గోలోకవాసిని ,గోపీవేషవిధాయక.పరమాహ్లాదరూప .సంతోష హర్షరూపిణి ,,నిర్గుణ, నిరాకార, నిర్లిప్త,ఆత్మస్వరూపిణి ,నిరీహ, నిరహంకార. భక్తానుగ్రహ నిగ్రహ ,విచక్షణులు వేదానుసార జ్ఞానం తో ఈవిడను తెలుసుకుంటారు .సురేంద్రమునీంద్రాదులైనా చర్మచక్షువులతో ఈవిడను చూడలేరు . వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది . నానాలంకార విభూషిత .కోటిచంద్రప్రభ .పుష్టిసర్వశ్రీయుక్తవిగ్రహ. శ్రీకృష్ణుని పట్లభక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది . వరాహావతారకాలంలో ఈవిడ వృషభానునిఇంట కూతురుగా ఉద్భవించింది .
ఈ తల్లి పాదస్పర్షతో వసుంధర పావనమయ్యింది. శ్రీకృష్ణుని వక్షస్థలం లో నివసిస్తూ నీలమేఘావృతమైన ఆకాశం లో మెరుపుతీగలా భాసిస్తున్నది.
ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల దివ్యసంవత్సరాలు తపస్సుచేసినా ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. అతడికి అలాదొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది .బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది . ఈరాధ దేవీ పంచమరూపం


నారదా ! స్రుష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో,కాలరూపంగానో,అంశరూపంగానో కళాశాంశారూపంగానో ఉంటూనే ఉంటుంది .స్త్రీలందరూ దేవీ స్వరూపాలే . పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ అయిదే.  [ దేవీ భాగవతం నుండి ]
Read more...

Wednesday 22 June 2011

నీతి శ్లోక, పద్యములు

1 comments

మంగళాచరణమ్‌

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే ।
స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1


తాత్పర్యము: త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము.


మూర్ఖపద్ధతి

బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥
అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥


తాత్పర్యము: బోధించే స్థానములో గురువులు మదమత్సర అసూయా పూరితులై వున్నారు. పాలించే ప్రభువులు గర్వాంధులైనారు. సామాన్యజనులు విని గ్రహించగలిగినంతటి తెలివిగలవారు కారు. కావున నా యీ సుభాషితము నాలోనే జీర్ణించుకుపోయి ఉన్నది. అనగా తన మనస్సు నందు అంతర్లీనముగా యింతకాలం వుండి పోయినదని అర్థము.


ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌ ।
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: మొసలి నోటికోరల మధ్య నున్న మాణిక్యమును ప్రజ్ఞతో బయటికి తీయవచ్చును. పెద్దపెద్ద అలలతో ఎగసిపడుతున్న సముద్రమును దాటవచ్చును. ఆగ్రహముతో బుసలు కొడుతున్న సర్పమును పూలదండలా శిరస్సున ధరించవచ్చును. కానీ దురాగ్రహపూరితుడైన మూఢుని సమాధాన పర్చుట అసాధ్యము.


లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్‌
పిబేచ్చ మృగ తృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్‌ శశ విషాణమాసాదయేత్‌
న తు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్‌ ॥


తాత్పర్యము: ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావులలో సైతం నీరు సంపాదించి దాహం తీర్చుకోవచ్చును. తిరిగి తిరిగి ఎలాగైనా కుందేలు కొమ్ము సంపాదించవచ్చును. (కుందేలుకు చెవులే కానీ కొమ్ములుండవు) కానీ ఎన్ని విధాల ప్రయత్నించినా మూర్ఖుని మనస్సును రంజింపచేయలేము.


వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।
మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే
మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥


తాత్పర్యము: తామర తూటి దారములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెనపువ్వు కొనతో వజ్రమును సానపట్టాలని ప్రయత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకునే వాడితోనూ మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ఆశించినవారు సమానులవుతారు.


స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।
విశేషతః సర్వ విదాం సమాజే
విభూషణం మౌనమపండితానామ్‌ ॥


తాత్పర్యము: మూఢులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికై బ్రహ్మ మౌనమును సృష్టించి వారి స్వాధీనం చేశాడు. కావున పండితుల సమక్షమున మౌనమే మూర్ఖులకి అలంకారము. అనగా మూర్ఖులు తెలియని విషయాలను చర్చించరాదు.


యదా కించిద్‌జ్ఞో-హం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞో-స్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖో-స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥


తాత్పర్యము: నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను. తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను.


కృమి కుల చిత్తం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం
నిరుపమ రసం ప్రీత్యా ఖాదన్ఖరాస్థి నిరామిషమ్‌ ।
సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే
న హి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతామ్‌ ॥


తాత్పర్యము: గాడిద యెముకలో మాంసము లేకపోయినా, దానిలో పురుగులు చేరినా, డొల్లుతో తడిసి కంపు కొడుతూ రోతపుట్టిస్తున్నా కూడా దానిని ప్రీతితో కొరుకుతూ వున్న కుక్క తన ముందు దేవేంద్రుడు ప్రత్యక్ష్యమైనా సిగ్గుపడదు. ఏలననగా, తాను స్వీకరించిన పదార్ధం తుచ్ఛమా, కాదా అను విషయాన్ని నీచప్రాణి పట్టించుకోదు!


శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।
అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా
వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥
తాత్పర్యము: గంగానదీమ తల్లి మొదట అంతరిక్షము నుండి ఏశ్వరుని శిరస్సు మీదకూ, అక్కడి నుండి హిమాలయముల మీదకూ, అచటినుండి భూమికీ, ఆపైన భూమి నుండి సముద్రములోనికి చేరి పాతాళమునకు చేరుకున్నది. అగ్రపీఠము నుండి స్థానభ్రంశము చెందిన వారికి యీ విధమైన అధఃపాతాళము సంభవిస్తుంది.


శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః ।
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మంత్ర ప్రయోగైర్విషం
సర్వస్యౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్య్తౌషధమ్‌ ॥


తాత్పర్యము: నిప్పును నివారించడానికి నీటిని, సూర్యతాప నివారణకు గొడుగునూ, మత్తగజమునకు అంకుశాన్ని, గాడిద, ఎద్దు తదితర జంతువుల కోసం కర్రనూ, రోగమునకు వివివ్ధ ఔషధములనూ, విషమునకు నివారణగా వివిధ మంత్రాలనూ శాస్త్రములందు వుదహరించబడ్డాయి. కానీ మూర్ఖత్వమును నివారించు మందు ఏదీ శాస్త్రములలో తెలుపలేదు. అనగా మూర్ఖత్వమునకు విరుగుడు లేదని భావం.
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ





Read more...

Monday 13 June 2011

పావులూరి మల్లన

0 comments
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నె చోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది. కాలంనాటివాడని, కాదు
ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం

శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ-
పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్
బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా-
శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్ 


గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన్న కరణంగా ఉండేవాడట. ఇతడు మహావీరాచార్యులు రచించిన గణిత సార సంగ్రహాన్ని తెనిగించాడు. మూలం ఆ సంస్కృత గ్రంధం కావచ్చునుగాని లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకొన్నవే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఇతని రచనలో కవిస్తుతి, పరిచయం వంటివి లేవు. ఇందులో ఒక పద్యం. 

చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్
బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యం
దులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది చేనలు రాజహంసమీ
నలిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే

మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.


అర్కాది గ్రహ సంచర గ్రహణ కాలాన్వేషణోపాయమునన్
దర్క వ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సం
పర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారమున్
దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?
విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.
Read more...

Sunday 12 June 2011

హనుమాన్‌ చాలీసా పుట్టుక

2 comments


తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆపరిస్థితులలోనే ఒక సంఘటన జరిగింది.
ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతం. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు! పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది!
అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమము చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో! ఆ ఆశ్రమములోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమువల్ల తన శోకం రూపుమాపగలడనుకున్నదేమో! ఏమనుకుందో ఏమోగాని, ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.
నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దేవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా! అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దేవెన నిష్పలమైంది కదా! అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మాఅ! ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాస్‌. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవం కట్లు విప్పి, ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి, తన కమండలములోని జలాన్ని శవంమీద జల్లాడు.
అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూసిన ఆతని భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు డిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో, రామనామం ఎంతో శక్తివంతమైనదని, రామనామస్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పాడు తులసీదాసు. మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా! అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.
రామచంద్రా! ఇదేమి పరీక్ష! రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా! రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి రామా! అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడైయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడం, కళ్ళు మూసుకుని ఉండటం, కనీసం తన తప్పు కాయమనుకోవకపోవడం, శరణు వేడకపోవడం, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి , ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా! తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.
ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను గుంజుకుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి.
చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు.

నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు. 
                      || జయ హనుమాన్ ||
Read more...

త్రైలింగస్వామి

0 comments

త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు.


ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు. తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి  చేరుకొని అక్కడ సుమారు 150 సంవత్సరాలు పైన ఉన్నాడు.


స్వామివారు కేవలం ఆకులూ అలములు, పండ్లు ఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు. స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు. ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు. ఒక్కొక్కసారి నీటిలోపల, అలల క్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు. వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికా ఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం, స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.


స్వామి అద్వైత ఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి అబద్దాలకోరు అని ఋజువు చేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు. సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు. త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు. స్వామివారిని కరుణించమన్నాడు. అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా! సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. వెళ్ళీపో" అన్నాడు. ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.


స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు. అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది. అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు. కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పుల పైన పచార్లు చేస్తూ కనిపించేవారు. ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు. అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా. అలా ఐతే నీ మలం నీవే తినగలవా?" అని ప్రశ్నించాడు. స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు. ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది. ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు. ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.


స్వామివారు పుష్య శుద్ధ ఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు. వీరి సమాధి కాశి లో పంచగంగ ఘాట్ లో ఉంది.
Read more...

శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు

0 comments
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
Read more...

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన

0 comments
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె  వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై ||
శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో  చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే  చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి  వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు
Read more...

త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

0 comments
రచన: నన్నయ్య 
 
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ  శ్రీకంధరా శ్శ్రేయసే ||
Read more...

మనుచరిత్రలో సాయంకాల వర్ణన

0 comments
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా
    షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
    శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
    ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్ 

ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు.


తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి ఈయనంటే మహా గౌరవం. ఆ మహాకవి కూర్చున్న పల్లకీని తన చేతులతో స్వయంగా పట్టి ఎత్తించాడట. సత్కార పూర్వకంగా ఇచ్చే గండపెండేరాన్ని తానే స్వయంగా కవి కాలికి తొడిగాడట. అదీ ఆ రాజప్రభువు సంస్కారం. అలాగే, పెద్దనకి రాయల వారంటే ప్రాణం. రాయలు మరణించినప్పుడు ఆయనతో తనూ పోలేక జీవచ్చవంలా బ్రతుకుతున్నానే అని వాపోయాడట.


‘మను చరిత్రము’ పెద్దన రచించిన ఒకే ఒక ప్రబంధ కావ్యం. దీనికే స్వారోచిష మనుసంభవమనే పేరు కూడా ఉంది. మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. తిమ్మన, ధూర్జటి లాంటి ఒకరిద్దరు కవులు సమగ్రమైన కావ్యాలు వ్రాసినా, వారంతా పెద్దన తర్వాత పేర్కొనవలసిన వారే. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు.
పూర్వం, కాశీ దగ్గర ఒక ఊళ్ళో ప్రవరుడనే నైష్టిక బ్రాహ్మణుడు ఉంటుండే వాడు. ఒకరోజు అతని ఇంటికి విచ్చేసిన ఒక సిద్ధుడు ఇచ్చిన పసరు కాళ్ళకు పూసుకొని, దాని ప్రభావంతో తాను చూడాలనుకున్న హిమాలయ పర్వతాలకు పోతాడు. చూడదలచుకున్న ప్రదేశాలన్నీ చూశాక, తిరిగి ఇంటికి పోదలచుకునేటప్పటికి పసరు కరిగిపోయి ఉంటుంది. ఇక చేసేది లేక అక్కడే కొండల్లో తిరుగాడుతున్న ప్రవరుడికి వరూధిని అనే అప్సరస కంపిస్తుంది. వరూధిని అతణ్ణి మోహించినా, ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోతాడు. దిగులుతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకుంటాడు. అలా పుట్టిన స్వరోచి, ఒక దేశానికి రాజు కావడమూ, వేట కెళ్ళినపుడు మనోరమ అనే యువతిని రక్షించి పెళ్ళాడడమూ, వారికి పుట్టిన కొడుకు స్వారోచిష మనువుగా పేరు పొందటమూ - ఇదీ, టూకీగా మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవం కథ.
కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంధం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.
ప్రవరుడు నిరాకరించి వెళ్ళిపోయిన తర్వాత, వరూధిని దిగులు పడుతూ వుండగా సాయంకాల మవుతుంది. ఆ సాయంసమయాన్ని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ, తరువాత చీకటిని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ వున్నాయి. ఒక పద్యంలో - తనను కోరివచ్చిన ‘అనన్య కాంత’ను అహంకారంతో నిరాకరించి వెళ్ళిపోయిన దుష్ట బ్రాహ్మణుడి మీద సూర్యుడికి కూడా కోపమొచ్చిందేమో అన్నట్లు - సూర్య బింబం కాషాయవర్ణం దాల్చిందట (చూశారా, పెద్దన గారికి కూడా వరూధిని మీదే సానుభూతి). నిజానికి, వరూధిని ప్రవరుడిని మోహించి, వాదోపవాదాలు చేసి, ఆఖరున మీద పడబోయిన ఆమెను చూసి, ఏమిరా, ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తించిందీ దేవకన్య! అన్న జుగుప్స కలగదు. పైగా, ఆమె చతురత, వాదనా పటిమ, హొయలూ, పాఠకుణ్ణి మెప్పిస్తాయి కూడానూ. అదీ పెద్దన నిర్వహణ తీరు!
సాయంకాల వర్ణన చేసిన పద్యం అని కదా చెప్పుకున్నాం. సాయంసమయాన్ని వర్ణిస్తూ అనేకమైన పద్యాలు ఉన్నా, ఇంత సహజ సుందరంగా, స్వభావోక్తిగా చేసిన పద్యం -దీనిని మించినది ఇంకొకటి లేదు. గొప్ప భావనా బలంతో, గొప్ప గొప్ప ఉత్ప్రేక్షలు గుప్పించిన పద్యాలున్నాయి గానీ, ఇంత నిసర్గమైన అందం గలిగిన పద్యం మరొకటి లేదు. ఇంతెందుకు? పెద్దనే, ఈ సందర్భంలోనే, చేసిన వర్ణన ఇంకొకటి ఉంది - “రవిబింబ పతన దీర్ణత పయోధీ గర్భ నిర్గత శేష ఫణి ఫణా రత్న రుచియొ…” - అని. సూర్యుడు పడమటి సముద్రంలో గ్రుంకగానే, ఆ దిక్కు ఆకాశపు కావి రంగు, కలగుండు పడగానే సముద్రపు అడుగునుంచి తల పైకెత్తిన ఆదిశేషుడి పడగల మీది మణుల మెరుపు లాగా, ఉందట. భావన చాలా దూరం పోయింది, వాస్తవం నుంచి దూరంగా. మరి, పైన చెప్పుకున్న పద్యం చూడండి.
సాయంకాలం అయ్యేసరికి ఆకాశంలో బారులు బారులుగా ఇంటిముఖం పట్టిన పక్షులూ, పగటి వేడి తగ్గగానే చల్లబడిన సూర్యకాంత శిలలూ, ఎండతో పాటే మాయమైపోయిన ఎండమావులూ, కాషాయ వర్ణం నింపుకున్న సూర్య బింబమూ, కాంతిని కోల్పోయిన దిక్కులూ, కొలనులో ముడుచుకొని పోతున్న తామరలూ - ఎంత సహజ సుందరమైన సంధ్యా సమయ వర్ణనో చూడండి. సాయంకాలాన్ని ఒక అద్భుతమైన చిత్రపటంలా మన కళ్ళ ముందు నిలిపాడు గదా, కవి.


కేవలం వర్ణనే కాదు, పద్యం నిర్వహించిన తీరు మాత్రం! ‘ణ’ ప్రాసను ఎంచుకొని, గొప్ప ధారను సాధించడానికి ‘ణ’కార పునరావృత్తిగా ఉష్ణాంశు, కోష్ణము, మృగతృష్ణ, నిద్రాణము, దరిద్రాణము, లాంటి పదాలను దట్టించి చెవులకు ఇంపైన సంగీత ధోరణి కల్పించాడు. అను నాసికా వర్ణాల పౌనః పుణ్యంతో, హాయిగా సాగే ధారతో, కండ్ల ఎదుట దృశ్యమానమయే నైసర్గిక సౌందర్యంతో, ఒక మరిచిపోలేని పద్యంగా నిలిచిపోయింది, ఈ పద్యం. వస్తు సౌందర్యమూ, వర్ణనా సౌందర్యమూ రెండూ కలిసిపోయి పుట్టిన ఇంకో సౌందర్యం - ఈ పద్యం. అందుకే, ఇది నాకు నచ్చిన పద్యం.
 
Read more...

Tuesday 7 June 2011

వెయ్యేళ్ళ తెలుగు పద్యం.

0 comments
మ.
హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో
భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా
హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్.


ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన.


వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం.


గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన !
 
Read more...

Monday 6 June 2011

నవగ్రహ ధ్యాన శ్లోకములు

0 comments

శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
     భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
     సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
     దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||

శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
      శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||


Read more...

Monday 23 May 2011

శ్రీ నృసింహ విశిష్ట ధ్యాన శ్లోకములు

0 comments
 ౧]కర్ణభార అంతర్గతము
  రచన: భాసకవి   


శ్లో||  నర మృగపతి వర్ష్మా లోకనభ్రాంతనారీ
       నర దనుజ సుపర్వ వ్రాత పాతాలలోక:
       కరజ కులిశ పాలీ భిన్న దైత్యేంద్ర వక్షా:
       సురరిపు బల హన్తా శ్రీధరోస్తు శ్రియేవ: ||  

౨] కోటగిరిలో చదివే ధ్యాన శ్లోకము:
 శ్లో||  గోఖండం వారమాండం పరివిరి విరిటం దర్పణాండం పరాండం
       దింభిం దింభిం కుటిమ్భిం పచడుహమాం కప్రజం పప్రజం పం
       త్రయ్యా స్త్రిస్త్రయ్యా కుకుకుకుకుకుకు: కుమాంకం కుమాంకుం
       ఏతత్తే    గహతు    గహతుమాం   నారసింహో   నృసింహ: ||

 
Read more...

శ్రీసూర్య భగవాన్ ప్రార్థన

0 comments
            శా. ఈవే చండగభస్తి మండలముచే నింకింతు వంభోనిధుల్ ,
                       నీవే విశ్వహితార్థమై కురియుదెంతే వాన మేఘాక్రుతిన్
                       దీవే చేయుదు భస్మరాశిగ వనానీకంబు దావాగ్నివై,
                       యీవే పెంచెద వెల్లయోషధుల రేలిందున్డవై వెన్నెలన్.
         
Read more...

Friday 20 May 2011

తెలుగు చాటువులు

0 comments
"కవి సార్వభౌమ" శ్రీనాథ ప్రణీతము.

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి  సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ కొన్ని పద్యాలూ అవధరించండి.




సిరిగల వానికి చెల్లును తరుణుల పదారువేల పెండ్లాడంగా
తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా, గంగ విడుము పార్వతి చాలున్‌ 


సున్నితమసస్కుడు.

సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.
శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌
సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌
మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ
నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ
అలాగే దుర్దశలో వున్న వారిని చూసి ప్రతిస్పందిస్తాడు కూడ -
వీసపు ముక్కునత్తు నరవీసపు మంగళసూత్ర మెంతయున్‌
గాసుకురాని కమ్మ లరకాసును కానివి పచ్చపూసలున్‌
మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడు రాగ నా
కాసలనాటి వారి కనకాంగిని జూచితి నీళ్ళరేవునన్‌.
ఈ పద్యంలో వున్నావిడ దుస్థితిని హేళనగానో చులకనగానో చెప్పవచ్చు కాని అదికాదు ఆయన దృష్టి. వస్త్రాభరణాల్లో పేదరికం పొంగిపారుతున్నా ఆయన దృష్టిలో ఆమె కనకాంగి! సార్వభౌముల సత్కారాలు పొందుతూ భోగభాగ్యాలు చవిచూసిన వ్యక్తి నుంచి పేదరికం పట్ల ఇలాటి స్పందన అపూర్వం, అనితరసాధ్యం. అందులోనూ, అప్పటి సమాజంలో!

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .


కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!

నీలాలకా జాల ఫాల కస్తూరికా తిలకంబు నేమిట దిద్దువాడ నంగనాలింగనా నంగ సంగర ఘర్మ శీకరం బేమిట జిమ్మువాడ మత్తేభగామినీ వృత్తస్తనంబుల నెలవంక లేమిట నిల్పువాడ భామామణీ కచాభరణ శోభితమైన పాపట నేమిట బాపువాడ ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి … అహహ పోయె నా గోరు తన చేతి పోరు మాని
Read more...